5 ఖండాలల్లోని 30 దేశాలకు చెందిన 50 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు.
అమెరికాలో – న్యూ యార్క్ లో టైం స్క్వేర్ వద్ద , న్యూ జెర్సీ లో ఎడిసన్ నగరము , అట్లాంటా , టెక్సాస్ రాష్ట్రాల్లో, డల్లస్ , హౌస్టన్, వాషింగ్ టౌన్ డీసీ , కాలిఫోర్నియా లో మిల్ పీటస్, శాన్ ఫ్రాన్స్ సిస్కో , లాస్ ఏంజెల్స్ , నార్త్ కరోలినా, విస్కోన్ సిన్ లో మాడిసన్ , చికాగో , న్యూ యార్క్ లో బాటరీ పార్క్ సహా పలుచోట్ల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత..పశ్చిమ్ బెంగాల్లో పెద్దయెత్తున హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనల్లో పలువురు మృతి చెందారు. వేలాదిమంది హిందువుల ఇల్లు ధ్వంసం అయ్యాయి .
అయితే హింసాకాండకు తృణమూల్ కార్యకర్తలే కారణమని..
బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. కేంద్రం కూడా ప్రత్యేక దృష్టిసారించి బెంగాల్లో సాధారణపరిస్థితులు నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు….