సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది.ఆమెను రాక్షసంగా పొట్టనపెట్టుకున్ ఆఫ్తాబ్…ఆ తరువాత కొన్నిరోజుల పాటు తన ఫోన్ నే వాడినట్టు తేలింది. శ్రద్ధా తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అతన్ని విచారణకు పిలిచారు. నవంబర్ 3న విచారణకు వెళ్తూ ఆమె ఫొన్ వెంట తీసుకెళ్లాడు ఆఫ్తాబ్. పోలీసులకు విషయం చేరింది కనుక ఫోన్ తన దగ్గర ఉంటే దొరికిపోతానేమోనని భయపడి ముంబైనుంచి డిల్లీకి తిరిగువస్తుండగా సముద్రంలో పారేశాడు. నార్కో పరీక్షల సందర్భంగా ఈవిషయాన్ని తెలిపాడు ఆఫ్తాబ్. ఫోన్లోకొన్ని సాక్ష్యాలున్నాయనీ అంగీకరించాడు నిందితుడు.