అరుదైన చిరుత జాతి భారత్ లో అడుగుపెట్టింది. 70ఏళ్ల తరువాత ఆ చిరుతలు ఇక్కడకు చేరాయి.మధ్య ప్రదేశ్ లోని కూనా నేషనల్ పార్క్ లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తూ వాటిని అందులోకి విడిచారు మోదీ. నమీబియా నుంచి వచ్చిన 8 చిరుతల్ని ప్రత్యేక క్వారంటైన్ ఎన్ క్లోజర్లోకి వదిలారు. తరువాత వాటిని స్వయంగా కెమెరాలో చిత్రించారు. నమీబియాలోని విండ్ హాక్ నుంచి ప్రత్యేక విమానంలో వీటిని రప్పించారు. 1952లో భారత్ లో ఈ జాతి చీతాలను అంతరించిన జీవిగా ప్రకటించారు. మళ్లీ ఇన్ని దశాబ్దాల తరువాత తీరిగి వాటిని దేశానికి రప్పించడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. అయితే ఈ చీతాలను చూడాలంటే సందర్శకులు కొంతకాలం ఆగాల్సిందే. ఇక్కడి వాతావరణ మార్పులను తట్టుకునేవరకు వాటిని జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది.
A long wait is over, the Cheetahs have a home in India at the Kuno National Park. pic.twitter.com/8FqZAOi62F
— Narendra Modi (@narendramodi) September 17, 2022