ఢిల్లీలో జరిగిన హిందూయువతి శ్రద్ధా హత్య ఘటన కలకలం రేపుతోంది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న ఆప్తాబ్ అమీన్ ఆమెను చంపి ముక్కలుగా నరికేసి ఢిల్లీ అంతటా విసిరేశాడు. తనను పెళ్లి చేసుకోమన్నందుకే ఈ ఘాతుకానికి తెగబడినట్టు తెలిసింది. ఆఫ్తాబ్ విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసాయి.
శ్రద్ధాను చంపేసిన కాసేపటికే ఆఫ్తాబ్ డేటింగ్ యాప్ బంబుల్ ను ఇన్ స్టాల్ చేశాడు. దానిద్వారా సైకాలజిస్ట్ అయిన మరో యువతితో పరిచయం పెంచుకున్నాడు. శ్రద్ధా బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్ లో ఉండగానే ఆ యువతిని తన అపార్ట్ మెంట్ కు తీసుకువచ్చాడు. అయితే ఆమె శరీరభాగాలు పెట్టడానికే అతను కొత్తగా ఫ్రిజ్ కొన్నాడని తేలింది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ఆఫ్తాబ్ కు సన్నిహితురాలైన ఆ యువతి జూన్, జులైలో అతనింటికి వెళ్లినట్టు ఇరుగుపొరుగు తెలిపారు. ఫ్రిజ్ లోని వంటగదిలో శ్రద్ధా శరీరభాగాలను ఉంచి…బయట ఆమహిళతో కలిసి ఉన్నాడతను.
శ్రద్ధాను చంపేసిన తరువాత ఆమె ఫోన్లో వచ్చే మెసేజెస్ కు ఆఫ్తాబ్ రిప్లై ఇచ్చేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులనూ తను చెల్లించాడు. ఆమె సోషల్మీడియా ఖాతాల్లోకి వెళ్లి స్నేహితులకు మెసేజులు చేస్తూ ఆమె బతికే ఉందనే అభిప్రాయం కలిగించాడు.
ముంబైలో ఉన్నంత కాలం శ్రద్ధా, ఆప్తాబ్ తరచూ గొడవపడేవారు. నమ్మి మోసపోయానని ఇద్దరూ గట్టిగా అరుచుకునేవారని చుట్టపక్కల వాళ్లు తెలిపారు. ఆఫ్తాబా తరచూ ఆమెను అనుమానిస్తూ తనెక్కడికి వెళ్లినా జీపీఎస్, ఆ ప్రాంతంలోని ఫొటోలు అడిగేవాడు. తరువాత ఈ ఏడాది మే 15న ఢిల్లీకి మకాం మార్చారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అక్కడా ఆమెను హింసించడం ఆపలేదు. తన హత్యతో గొడవకు ముగింపు పలికాడు ఆఫ్తాబ్.
అయితే ఆ ఫ్లాట్ నుంచి ఎలాంటి అరుపులు, కేకలు వినిపించలేదని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు.నిద్రిస్తుండగా ఆమె గొంతుకోసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఆమెను చంపిన తరువాత మృతదేహాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని కొత్తగా తెచ్చిన ఫ్రిజ్ లో ఉంచి… శరీరభాగాలను ఒక్కొక్కటిగా పారేశాడు. ఆ తరువాత వెంటనే కాల్ సెంటర్లో ఉద్యోగిగా చేరాడు.