శ్రద్ధావాకర్ హత్యకేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది ఢిల్లీలోని సాకేతే కోర్టు. కస్టడీలో ఉన్న ఆఫ్తాబ్ జైలు అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడు. తాను చదువుకోవడానికి లా పుస్తకాలు, చలితీవ్రత తట్టుకునేలా వెచ్చని దుస్తులు కావాలని ఈసారి జడ్దినే డిమాండ్ చేశారు. దీంతో ఆయనకు దుస్తులు ఇవ్వాలని సాకేత్ కోర్టు జడ్జి అధికారులను ఆదేశించారు.సహజీవనం చేస్తున్న శ్రద్దావాకర్ ని చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిపెట్టి వీలును బట్టి శివారు ప్రాంతంలో అడవుల్లో పడేశాడు. ఆమెను చంపి ముక్కలు చేయడానికి ముందు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్న చదివానని. క్రైమ్ షోలు చూస్తు సమాచారం తీసుకున్నానని విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే.