రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం రాహుల్ యాత్రలో పాల్గొన్నారు శివసేన యువనాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కలమ్నురి వద్దకు రాహుల్ చేరుకోగానే…ఆయనతో జాయినయ్యారు ఆదిత్య. ఆదిత్యతో పాటు శాసనసభలో ఆ పార్టీ విపక్ష నేత అంబాదాస్ దన్వే, మాజీ ఎమ్మెల్యే సచిన్ అహిర్ రాహుల్ తో కలిసి నడిచారు. రాహుల్ యాత్ర నేటితో 66వ రోజుకు చేరింది.
త్వరలో బీఎంసీ సహా పలు మునిసిపాలిటీలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్రలో ఆదిత్య పాల్గొనడాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు,