అదిలాబాద్ : మోది 3.0 లో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లను ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అభినందనలు తెలిపారు. ఢిల్లీలో సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ముస్తాపుర్ అశోక్.శ్రీనివాస్ తదితరులున్నారు.