ఎంత తేడా ఉన్నదో గమనించారా ?
భర్తృహరి సుభాషితాలలో ఒక సుభాషితం ఉన్నది …
అది..
విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా
స్తేఽపి స్త్రీ ముఖపంకజం సులలితం దృష్ట్వైవ మోహం గతాః ।
శాల్యన్నం సఘృతం పయోదధియుతం యే భుంజతే మానవా
స్తేషామింద్రియ నిగ్రహో యది భవేద్వింధ్యః ప్లవేత్సాగరే
అంటే..
విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైనవారు గాలి- నీరు – ఆకులను తినినవారు. అలాంటివారు కూడ స్త్రీని చూచి మోహాన్ని పొందారు. సన్నన్నం, నెయ్యి, పాలు, పెరుగు తిన్నవారికి ఇంద్రియ నిగ్రహం ఉంటే ?
ఇంద్రియనిగ్రహమనేది ఉంటే
సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది. – అని భావం…
మరి ఉండనప్పుడు ఏం చేయాలి ?
ఆదిశంకరులు దానికి ఒకవిరుగుడు చిట్కా చెప్పారు.
అదేమిటంటే..
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
సత్సాంగత్యం వలన నిస్సంగత్వం (detachment ) ఏర్పడుతుంది దానివలన మోహం తొలగుతుంది మొహం తొలగటం వలన మనిషి నిశ్చలంగా ఉంటాడు అదిజీవన్ముక్తికి కారణమవుతుంది.
మనిషి మనసు రాగి చెంబు లాంటిది, దానిని సత్సాంగత్యము అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోమాల్సిందే లేకపోతే మోహము అనే చిలుము పడుతుంది.
ప్రతి మనిషిలో Dr.Jekyll and Mr.Hyde ఉంటారు ! (ఈ పేరుతో ఒక నవల రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ వ్రాశారు) అంటే Dr Jekyll అనే మంచిపార్శ్వము Mr Hyde అనే చెడు పార్శ్వము రెండూ ఉంటాయి.
మంచిని వింటూ మంచిని చూస్తూ పెరిగితే మనిషిలో మంచి dominate చేస్తుంది.
అదే హింస,మానభంగాలు ,అవినీతి ఇలాంటి చెత్తతో కూడిన సినిమాలు మన హాల్లోనే OTT లో ఒక రిమోట్ ఆపరేట్ చేస్తేనే చూడగలిగే జనరేషన్ మంచిగా పెరుగుతుందా చెడుగా పెరుగుతుందా ? ఊహించండి !
ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అని టివీ లో చూస్తూ వింటూ పెరుగుతున్న తరానికి రేడియోలో జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి అని విని పెరిగిన తరానికి ఎంత తేడా ఉన్నదో గమనించారా ?
Courtesy :- Vutukuru Janaki RamaRao