కలియుగానికి 36 సంవత్సరములకు పూర్వం ద్వాపరయుగ అంతంలో ధర్మసంరక్షణకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షోణిలా సైన్యం ఆహుతి అయింది,భారత్ దేశ చరిత్రలో అది ఒక కీలక ఘట్టం. భగవాన్ శ్రీ కృష్ణుడు సంరక్షించిన ధర్మం ఆ తర్వాత ఎక్కువ కాలం నిలువ లేక పోయింది దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలి పోతూ దేశం పతనం వైపు వేగంగా పరుగులు తీస్తున్నది , అలాంటి సమయంలో దేశాన్నిసరియైన దిశలో నడిపించటానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.మన దేశానికీ అంతిమ ప్రమాణం వేదం ఆ వేదాలలోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం మూడు కొత్త దర్శనాలు ఆవిష్కరించబడ్డాయిఅవి 1) పతంజలి యోగ దర్శనం 2) జైమని మీమాంస దర్శనం 3) బాదరాయణని వేదాంత దర్శనము. బాదరాయణుడు వేదాలలోని కర్మకాండ ను, జ్ఞాన కాండను వేరు చేశారు. కర్మ కాండ వల్ల ఎక్కువ ప్రయోజనం లేదు అని భావించిన బాదరాయణుడు పరమ జ్ఞానోధ్బవ మైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాతి కాలంలో వేదాంత దర్శనం ఆధారంగా అనేక మంది పురుషులు లోక కల్యాణం కోసం పనిచేయడం ప్రారంభించారు, అట్లా పనిచేసిన వారిలో ఆదిశంకరులు అగ్రగణ్యులు. ఆదిశంకరులుకలియుగాబ్ది 2593వ సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం 509 సంవత్సరంలో జన్మించారు అంటే ఈ మే 17కి 2530 సంవత్సరాలు పూర్తి అయ్యి 2531 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది . రెండు వేల ఐదు వందల ముప్పై సంవత్సరాలకు పూర్వం జన్మించిన ఆదిశంకరుల మనం ఇప్పుడు ఎందుకు స్మరించుకోవాలి.
ప్రపంచంలో ఏ మహాపురుషుడినైనా అర్ధంచేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్మించిన నాటికీ దేశంలో ఉన్న పరిస్థితులు ఆ పరిస్థితులను సరిచేయటానికి వేరుచేసి ప్రయత్నాలు అప్రయత్నాలసాఫల్యం అర్ధం చేసుకోవాలి. శంకరాచార్యులు జన్మించేనాటికి బౌద్ధమతం వెర్రితలలు వేస్తున్నది. శంకరాచార్యులు జన్మించేనాటికి దేశంలో బౌద్ధమతం వెర్రితలలు వేస్తున్నది, అట్లాగే కర్మకాండఎంతగా పెరిగి పోయింది అంటే ప్రజల మానసికమైన సత్ ప్రవర్తన కంటే యజ్ఞయాగాలు మాత్రమే గొప్పవని భావిస్తున్నారు , ధర్మ శాస్త్రవేత్తలలో కూడా నీచ ప్రవృత్తులు మొలకెత్తి దయ, శాంతి, అక్రోధం, అహింస , స్థానంలో క్రౌర్యం, క్రోధం, హింస , ఆక్రమించాయి, క్షమ అంటే పిరికితనం కింద భావించబడుతున్నది దానితో వివిధ సంప్రదాయాల మధ్య సంఘర్షణలు కూడా జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో చక్కదిద్ది దేశంలో జాతీయ సమైక్యతను నిర్మాణం చేయవలసిన ఒక చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది, దానిని పూరించటానికి జన్మించిన వారే ఆదిశంకరాచార్యులు.
శంకరాచార్య గురుపరంపరను తెలుసుకోవటం అవసరము. వేదాంత దర్శనం ప్రబోధకుడైన బాధ రాయునుడు తనకుమారుడైన శుకదేవునికి వేదాంత దర్శనం దానిపై వ్యాఖ్యానం బోధించాడు ,శుకదేవుడు తన శిష్యుడైన గౌడపాదులు కు బోధించారు , ఆ గౌడపాదులశిష్యుడైన గోవిందపాదులకు బోధించారు. ఆ గోవిందపాదులు నర్మదా నది ఒడ్డున అమర కాంతం లో ఆశ్రమం నిర్మించుకొని వేదాంత దర్శనం బోధించసాగారు. ఆ గోవిందపాదుల వారి శిష్యుడే శంకరాచార్యులు. శంకరాచార్యులు వారి ప్రతిభాపాటవములు చూసి గోవిందపాదులు తన జ్ఞానమంతా శంకరాచార్యులకు ధారబోసి తన గురువైన గౌడపాదుల దగ్గరకు తీసుకుని వెళ్లారు,గౌడపాదులవారు దేశంలో ధర్మసంరక్షణకొరకు విధి పూర్వకమైన సన్యాస ధర్మం శంకరుల వారికి ఉపదేశించారు. శంకరాచార్యులు గౌడపాదుల వద్ద ఒక ప్రక్క అధ్యయనం చేస్తూనే మరో ప్రక్క అనేక భాష్యాలు రచించారుఅందులో ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు వేదాంత సూత్రాలు, భగవద్గీతమొదలైనవి ఉన్నాయి భగవాన్ శ్రీకృష్ణుడుబోధించిన భాగవత ధర్మమూ కర్మకాండపై తిరుగుబాటు ప్రారంభించింది. భాగవత ధర్మం వేదాల మీద వైదిక వ్యవస్థ మీద సంపూర్ణంగా ఆదరభావం చూపించింది. బుద్దుడు వరకు మన ధార్మికభావన మెల్ల మెల్లగా ఏ ఒడుదుడుకులు లేకుండా వికసిస్తూవచ్చింది . బౌద్ధం కూడా కర్మకాండ మీద యుద్ధం ప్రకటించింది, కర్మకాండకు మూలం వేదములు ,బ్రాహ్మణులూ అని భావించివేద మార్గాన్ని వదిలేసే కొత్త మార్గంలో పయనించే ప్రయత్నం చేసింది అది కొంతకాలం బాగున్నదనిపించింది కానీ కల క్రమంలో అది వ్యక్తి కేంద్రితమైనది దానితో సమస్యలు మొదలైనయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది దేశాన్ని ఒకప్రక్క రూఢి వాదంకూపంలో , మరోప్రక్క నాస్తికకూపం లో దేశంపడకుండా కాపాడినవారు శంకరులు.
ఈ పనిని పూరించడానికి యోగ్యులైన శిష్యులను ఎంపిక చేసుకోవడం ఒక పెద్ద పని ఆ పనిని మొట్టమొదట కాశీ నుండి ప్రారంభించారు. కాశీ పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారందరినీ తన శిష్యులుగా మార్చుకున్నాడు వాళ్లలో పద్మ పాదుడు ఒకరు, అట్లాగే తన బాల్యమిత్రుడు విష్ణు చిత్సికుడు డైనాడు , విష్ణు ప్రయాగ క్షేత్రం లో అక్షయ వట వృక్షం కింద ప్రాణత్యాగం చేసుకోడానికి సిద్ధపడుతున్న కుష్టి రోగి నీ కాపాడి అతని రోగం నయం చేసి తన శిష్యులుగా చేసుకున్నాడు అతడికి ఉదంకుడని పేరుపెట్టాడు ,అక్కడి నుండి ప్రతిష్టనాపురంచేరి కుమారిలభట్టు శిష్యుడైన ప్రభారాచార్యులతో శాస్త్ర చర్చలు చేసి తనతో కలుపుకున్నారు అతని కొడుకు పృథ్వీధరుడుని శిష్యుడు గా చేసుకొని హస్తమాలకుడనే పేరు పెట్టాడు .కుమారిలభట్టు శిష్యులలో శ్రేష్ఠుడైన మండన మిశ్రుడు తో శంకరాచార్యులవారు శాస్త్ర చర్చచేసిన మండన మిశ్రుడుచివరకు అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించారు.ఆ తదుపరి మండన మిశ్రుని సహధర్మచారిణి తో చర్చలుచేసి ఒప్పించారు. మండన మిశ్రుడు సన్యాసాశ్రమం స్వీకరించారు.
అక్కడి నుండి తన శిష్య బృందంతో తక్షశిల చేరుకొని బౌద్ధమతచార్యులతో చర్చలు చేసారు. భారతదేశ సాంఘిక వ్యవస్థ యధాతధంగా ఉన్నంతకాలం భారత దేశాన్ని ఏమి చేయలేము అని నిర్ణయానికి వచ్చిన బౌద్ధులు ఈ దేశ సంస్కృతి సంప్రదాయం ల నుండి ప్రజలను దూరం చేయట మొదలుపెట్టారు ఆ ప్రమాదంనుండి శంకరాచార్యులు దేశన్ని కాపాడారు. అక్కడి నుండి శంకరులు కశ్మీర్ చేరుకొని అక్కడ శారదా మాత అనుగ్రహం పొంది కశ్మీర్ పండితులనుతనతో కలుపుకున్నారు, అతదుపరి అస్సాం, కామరూపం, ప్రాగ్జోతిషపురం చేరుకొని తాంత్రిక విద్యల ప్రఖండులను తనతో కలుపుకొన్నారూ. ఇట్లా శంకరాచార్యులు ఆసేతు హిమాచలం మానస సరోవరం కాలినడకన ప్రయాణించి దేశంలో తిరిగి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. ఈ దేశం ఒకే ఆత్మ తో కూడుకొన్నాద నే సత్యాన్ని ప్రజలు గుర్తించేట్లు చేశారు. ఈ భావాలు నిరంతరం జాగ్రత్తగా ఉండేందుకు దేశం నాలుగు మూలల నాలుగు పీఠాలు స్థాపించారు వాటిని నేడు శంకర పీఠాలుగా వ్యవహరిస్తున్నాం అందులో 1) దక్షిణన శృంగేరి 2) ఉత్తరాన బదిరీ 3) తూర్పున పూరీ 4) పడమర ద్వారక ఆ పీఠాలకు తన శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు అప్పటినుండి అవి అవిచ్ఛనంగా కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి .అట్లా శంకరాచార్యులు తన ఆధ్యాత్మిక శక్తితో ఈ దేశాన్ని విశ్వగురువు పీఠంపై నిలబెట్టారు. ఈ పనంతా తన 32 సంవత్సరాలలో పూర్తి చేసారు. ఈ రోజు ప్రపంచాన్నేఅల్లకల్లోలం చేస్తున్న సెమిటిక్ మతాలను ఎదుర్కొనే ఆధ్యాత్మిక శక్తిని అద్వైత సిద్ధాంతం, పంచాయతన పూజ పద్దతి తో మనకు శంకరాచార్యులు అందించారు. అందుకే జాతీయ పునర్నిర్మాణం మహాయజ్ఞంలో ప్రేరణ స్రోతస్సు ఆది శంకరులే.