ఇటీవల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా దాడులకు పాల్పడిన నేపథ్యంలో మరో 18 సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్ పంపింది కేంద్రం. జమ్ముకశ్మీర్ సమీప ప్రాంతాలనుంచి 8 కంపెనీలు, ఢిల్లీనుంచి 10 కంపెనీలను జమ్ముకశ్మీర్ తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం రాజౌరి జిల్లా అప్పర్ డాంగ్రీ గ్రామంలో జరిగిన వేర్వేరు ఉగ్రదాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. దాడులను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి పలు సంస్థలు. ఇక మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని… గాయపడిన వారికి లక్షచొప్పున, మెరుగైన చికిత్సను అందిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.