అపరకుబేరుడు దానకర్ణుడిగా నిలిచారు. ఆసియాలో పెద్దఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేసే వాళ్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. అందులో భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ ఆదానీ పేరు దక్కించుకున్నారు. దాతృత్వంలో ఏసియా హీరోలు పేరిట విడుదల చేసిన జాబితాలో ఆదానీతోపాటు భారత్ కు చెందిన మరో ఇద్దరి పేర్లూ ఉన్నాయి. ఈ ఏడాది జూన్లో తన 60వ జన్మదినం సందర్భంగా దేశంలో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి కోసం 60వేల కోట్లు ఖర్చుపెట్టాలని ఆయన నిర్ణయించారు. ఆరోజు చేసిన ప్రకటన ద్వారా గొప్ప పరోపకారిగా ఆదానీ నిలిచారని ఫోర్బ్స్ ప్రకటించింది.