దిగ్గజ పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడోస్థానంలో ఉన్నాడు. 137 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రాన్స్ కు చెందిన ప్రసిద్ధ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ ఎల్విఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను అదానీ వెనక్కు నెట్టేశాడు. ప్రస్తుతం 251 బిలియన్ డార్లతో మొదటి స్థానంలో ఎలన్ మస్క్, 153 బిలియన్ డాలర్ల సంపాదనతో జెఫ్ బెజోస్ రెండవ స్థానంలో నిలవగా..137 బిలియన్ డాలర్ల సంపాదనతో గౌతమ్ అదానీ మూడో స్థానంలో నిలిచారు.
కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్న ఆదానీ… తాజాగా మీడియారంగంలోకి ప్రవేశించారు. బొగ్గు ,సిమెంట్, అల్యూమీనియం నుంచి పోర్టుల వరకు ఆదానీ వ్యాపారాలున్నాయి.అన్ని రంగాల్లో విస్తరించూ సంపద పెంచుకుంటూ పోతున్నారాయ. 2022లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అదే ఊపుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోకెల్లా సంపన్నుడిగా నిలిచారు.
ఇప్పటి వరకు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటి సారి. గతంలో ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా కుబేరుల జాబితాలో తొలి ఐదు స్థానాలకు చేరుకున్నప్పటికీ మూడవ స్థానంకు చేరుకోలేకపోయిన విషయం తెలిసిందే.
ఇక బ్లూమ్బెర్గ్ తాజా ఇండెక్స్ లో బిల్ గేట్స్ 5వ స్థానంలో నిలిచాడు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు జులైలో బిల్ గేట్స్ ప్రకటించారు. వారెన్ బఫెట్ 35 బిలియన్ డాలర్లను ఇప్పటికే విరాళం ఇచ్చారు. బిలియన్ల కొద్దీ డాలర్లను విరాళంగా ఇస్తుండటంతో బ్లూమ్బర్గ్ వెల్త్ ర్యాంకింగ్స్లో వీరు కిందకు దిగజారారు. భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 91.9 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు.