
ఈ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ జెఫ్రీస్ ఆదాని గ్రూప్ మీద హిండన్బుర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై
తన అభిప్రాయం చెప్పింది.
ఆ నివేదిక లో ముఖ్య అంశాలు:
* ఆదాని గ్రూప్ కి భారత బ్యాంకులు ఇచ్చిన అప్పులు మేనేజి చేయగలిగే అంత స్థితిలోనే ఉన్నాయి.
* ప్రభుత్వ బ్యాంకుల మొత్తం అప్పుల్లో ఆదాని గ్రూప్ అప్పుల వాటా కేవలం 0.7%మాత్రమే, అది ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే 0.3% మాత్రమే అని చెప్పింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అప్పుల్లో ఆదాని గ్రూప్ అప్పులు 0.5% మాత్రమే అని ఆ నివేదిక చెప్పింది.
* డెట్/EBITDA రేషియో 2016లో ఇది 4.3x ఉంటే ఇప్పుడు 3.22x తగ్గింది. అంటే 2016 తో పోలిస్తే 2022కి సంస్థకు అప్పు తీర్చే సామర్థ్యం పెరిగింది అని. ( ఈ రేషియో తక్కువ శాతం ఉంటే సంస్థకు అప్పు తీర్చే సామర్ధ్యం బలంగా ఉన్నట్లు)
* సంస్థకి ఉన్న మొత్తం అప్పుల్లో బాంక్ రుణాలు 33%మాత్రమే, మిగతావి విదేశీ బాంక్ ల అప్పులు, బాండ్స్. మేం భవిష్యత్తులో ఇంకా మదించి చూస్తాం, కానీ ప్రస్తుతానికి బాంక్ అప్పులకు ముప్పు తక్కువే ఉంది.
* ఆదాని గ్రూప్ మొత్తం స్థూల అప్పులు ₹1,90,000 కోట్లు. నికర అప్పులు ₹1,60,000 కోట్లు. 2016లో 70వేల కోట్లు అప్పు ఈ 2022 సం. వచ్చేసరికి ₹1.60లక్షల కోట్లకు పెరిగింది. ఈ గ్రూప్ పలు రంగాల్లో కి తమ వ్యాపారం విస్తరించింది. ఆ అప్పులు ఈ గ్రూప్ CAPEX అంటే మూలధన వ్యయమే చేసినట్లు కనిపించింది. (అంటే ఆదాయాన్ని పెంచే ఆస్తులు కొనుగోలు అని చెప్పుకోవచ్చు)
* ఇటువంటి పరిశ్రమలో ఉన్న ఇతరులతో ఇటీవలి మా సంభాషణలు కూడా ఈ గ్రూప్ నగదు ప్రవాహాలు (కాష్ ఫ్లోస్ మరియు అప్పులు చెల్లింపు సమయపాలన సంప్రదాయబద్ధంగా (conservative) గా ప్రణాళిక చేయబడిందని తెలియవచ్చింది. అందువల్ల, DSCR (అంటే అప్పు తీర్చే సామర్ధ్యం) మరింత మెరుగ్గా ఉండవచ్చు. మేము ఇక్కడ పరిణామాలను గమనిస్తున్నప్పుడు, భారతీయ బ్యాంకింగ్ రంగానికి వచ్చే మెటీరియల్ రిస్క్ మాకు కనిపించడం లేదు, ”అని జెఫ్రీస్ బ్రోకరేజి సంస్థ పేర్కొంది.
నా మాట:
ఇన్ని వ్యాపార రంగాలలో అంటే ఎయిర్ పోర్ట్స్, విద్యుత్, సోలార్, గనులు, పోర్ట్స్, రిటైల్ పరిశ్రమ, ఆహార స్టోరేజి పరిశ్రమ ఇలా పలురంగాల్లో విస్తరించిన ఆదాని గ్రూప్ కి పై బ్రోకరేజి సంస్థ రిపోర్ట్ ప్రకారం స్థూల అప్పులు ₹1.90లక్షల కోట్లు, నికర అప్పులు ₹1.60లక్షల కోట్లు. ఆ రిపోర్ట్ ప్రకారమే బ్యాంకుల అప్పులు మొత్తం అప్పుల్లో 33% . అంటే 3వ వంతు. అంటే మొత్తం స్థూల అప్పులే తీసుకున్నా అంటే ₹1.90లక్షల కోట్లు తీసుకున్నా దానిలో 3వ వంతు అంటే ₹64లక్షల కోట్లు మాత్రమే బ్యాంకు అప్పులు. ఈ అప్పు తోటే ఆదాని గ్రూప్ అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతూ ముఖ్యంగా చైనా కంపెనీలతో పోటీ పడుతూ విదేశాల్లో పోర్ట్ లు, గనులు చేజిక్కుంచుకుంటూ దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించే మార్గాలు చూస్తున్నాది.
సరే! ఆంధ్రాలో UPA టైం లో బ్యాంకుల వద్ద అప్పులు విపరీతంగా తీసుకుని ఒక పెద్ద రాజకీయ పారిశ్రామిక వేత్త లగడపాటి బ్యాంకులకు చెల్లించలేక చేతులు ఎత్తేసిన అప్పు మొత్తం ఎంతో తెలుసా? 2018 సం.కే జస్ట్ ₹50,000కోట్లు. అంటే కనీసం 10% వడ్డీ వేసుకున్నా నేటికి ఆ అప్పు మొత్తం ₹70,000కోట్లకు పైనే. సరే ఆయన వ్యాపారం వల్ల దేశానికి ఏం ఒనగూరిందో కాంగ్రెస్ మీడియా చెప్పాలి.
అయినా ఆయన కాంగ్రెస్ నాయకుడు, గుజరాత్ వాడు కాదు. కాబట్టి తెలుగు మీడియా నవరంధ్రాలు మూసుకుని కూర్చొని ఉంటుంది తప్ప పేపర్లలో ముఖ్య పేజీల్లో ఒక్క వాక్యం కూడా రాయదు.
అంటే ఆదాని గ్రూప్ బాంక్ అప్పుల మొత్తం 64వేల కోట్లు ములిగిపోతే దేశం అధోగతి పాలు అయిపోతుంది అనే విధంగా తెలుగు మీడియా ఏ ఉద్దేశ్యంతో ఇటువంటి మసాలా వార్తలు రాస్తోంది?
యూపీఏ టైంలో భూషణ్ స్టీల్ వంటి సంస్థలకు వేల కొట్లలో బ్యాంకులు ఆప్పులు ఇచ్చాయి. అన్ని దివాళా కొట్టాయి. వాటి గురించి తెలుగు మీడియాలో ఎన్ని వ్యాసాలు చదివారు?
….చాడా శాస్త్రి…
కొస మెరుపు:- ఆడాని గ్రూప్ మీద వ్యతిరేక రిపోర్ట్ రాసిన ఆ సంస్థ రిపోర్ట్ చివరిలో ఈ విధంగా రాసింది. ” ఈ రిపోర్ట్ బయటకు రావడం వల్ల ఈ రిపోర్ట్ లో రాసిన సంస్థ షేర్ల ధరలు పడిపోయి మా గ్రూప్ కానీ, దీని అనుబంధ గ్రూపులు కానీ, దీనికి సంబంధించిన వారు కానీ షార్ట్ సెల్లింగ్ వల్ల పెద్ద ఎత్తున లాభపడితే మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు” – చాడా శాస్త్రి