గాల్వాన్ మీకు హాయ్ చెప్తోందంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమై దుమారం రేగడంతో
క్షమాపణలు చెప్పింది నటి రిచా చద్దా. సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతోనెటిజన్లు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో తన లాయర్ నవీనా బేటీ సచార్ ను టాగ్ చేస్తూ క్షమాపణలు చెప్పింది ట్విట్టర్లోనే. ఆ మూడు పదాలు ఎవర్నైనా నొప్పించినట్టైతే, ఎవరి మనోభావాల్నైనా దెబ్బతీసినట్టైతే అందుకు నేను క్షమాపణలు కోరుతున్నా అంది. తన సోదరులు సహా బంధువులు ఆర్మీలో పనిచేశారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇక్కడా తన విక్టివ్ కార్డును వాడుకుందామె. అందరికీ బై అంటూ రిప్లై ఫీచర్ డిసేబుల్ తో ట్వీట్ చేసింది.
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ నార్తర్న్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ అన్న మాటలను కోట్ చేస్తూ రిచా …గాల్వాన్ హాయ్ చెప్తోందంటూ ఎగతాళిగా రీట్వీట్ చేసింది. ఆమె అనుచిత వ్యాఖ్యల్ని, సైన్యాన్ని అవహేళన చేయడాన్ని నిరసిస్తూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె తన ట్వీట్ ను తొలగించింది.
@BediSaveena pic.twitter.com/EYHeS75AjS
— RichaChadha (@RichaChadha) November 24, 2022
అయితే ఆమె ట్వీట్ ను, ఆమెను కాంగ్రెస్ నాయకుడు’military affairs’ కాలమిస్ట్ మన్ దీప్ బజ్వా సమర్థించడం గమనార్హం. రిచా చాలాధైర్యశాలి అని, దమ్మున్న ట్వీట్ చేసిందనీ కొనియాడారు.
Gutsy girl. Not Bholi but Punjaban Sherni.
— Mandeep Singh Bajwa (@MandeepBajwa) November 24, 2022
2020 జూన్లో గాల్వాన్ లోయలో చైనా సైనికులు, భారతఆర్మీ పరస్పరం తలపడ్డారు. 20మంది భారతసైనికులు ఆ ఘర్షణల్లో అసువులు బాశారు. చైనా సైనికులు సైతం మృతిచెందారు. ఎంతమంది అనేది ఆదేశం అధికారికంగా ప్రకటించలేదు.
ఇక రిచాపై మండిపడ్తున్న నెటిజన్లు…వచ్చేనెలలో విడుదవుతోన్న ఫుక్రే-3 సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే అలీఫజల్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది రిచా.