కోవిడ్ ను అదుపుచేసేందుకు కేంద్రం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ మేరకు ఔషధ ఉత్పత్తి దారులతో గురువారం మోదీ వర్చువల్ గా మాట్లాడారు. ముఖ్యంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
1. 18 ఏళ్లపైబడిన వారికి టీకాలు వేయడం…
మే 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ 18 ఏళ్లు నిండిన అందరికీ వేయాలని ఇప్పటికే నిర్ణయించారు. వాక్సిన్ తయారీదారులు తాము ఉత్పత్తి చేసిన టీకాలో 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు మిగిలిన యాభై శాతం మార్కెట్లో విడుదల చేయాలని చెప్పారు. టీకా వేసే కేంద్రాలను పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 73,600 కేంద్రాలు ఉన్నాయి.
2. టీకాఉత్పత్తి ని వేగవంతం చేయటం
ఇది చాలా కీలకమైన అంశమని చెప్పవచ్చు.అందుకు భారత ప్రభుత్వం కావల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నది. రాబోయే రోజుల్లో అతితక్కువ కాలపరిమితిలో ఎక్కువమందికి వాక్సినేషన్ పూర్తి చేయాలని మోదీ ఆయా కంపెనీలకు విజ్ఞప్తిచేశారు.
వాక్సిన్ తయారీ సంస్థలైన సీరం ఇన్ స్టిట్యూట్ కు 3 వేల కోట్లు. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీకి 15 వందల కోట్లు కేటాయించింది కూడా. నెలకు కనీసం పదికొట్ల వాక్సిన్ తయారీని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సెప్టెంబర్ నాటికి ఉత్పత్తిని మరింత పెంచేందుకు రెండు కేంద్రాలను గుర్తించింది. యూపీ బులంద్ షహార్ దగ్గర బయోలాజికల్స్ లిమిటెడ్, హైదరాబాద్ లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తయారవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ముంబైలోని హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా వాక్సిన్ తయారీకి ముందుకు వచ్చింది.
ఇక వీటితో పాటు ప్రపంచంలోని రెండు కంపెనీల్లో ఒకటైన జె అండ్ జె కి టీకా కాంట్రాక్ట్- తయారీకి భారతీయ సంస్థ బయోలజికల్ ఇ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోగా… నోవావాక్స్ …సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.దీనికి ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది . దేశంలోని ఐదు భారతీయ కంపెనీలు రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీ కోసంఒప్పందాలు కుదుర్చుకున్నాయి.దీనితో మొత్తంఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 950 మిలియన్కు చేరుతుంది. ఆ కంపెనీల్లో డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్, పానాసియా బయోటెక్, విర్చో బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా ,గ్లాండ్ ఫార్మా.
3. ఆక్సిజన్ సరఫరా…
కోవిడ్ కేసులు పెరుగుతున్నకొద్దీ ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయి. ఆ అవసరాలు తీర్చటానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ , తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ సహా దేశరాజధాని డిల్లీ కి 17,092 మెట్రిక్ టన్నుల వైద్య ఆక్సిజన్ను తరలించడానికి ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని అన్ని ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు రౌండ్-ది-క్లాక్ పని చేయాలని ఆదేశించింది ..దీనిని వేగంగా అందించటానికి భారతీయ రైల్వే… ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను “గ్రీన్ కారిడార్” వెంట నడుపుతున్నారు. ఆక్సిజన్ తీసుకోని రావ డానికి మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ముంబైనుంచి వైజాగ్కు చేరింది కూడా.
ఇంత పని జరుగుతుంటే… ఓ వర్గం మీడియా సహా…విపక్షాలు తమ రాజకీయ మైలేజీ కోసం కేంద్రంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో దిగజారిన రాజకీయాలకు తాజా ఉదాహరణ ఇది.మరో వైపు వ్యాపార వర్గాలు మెడిసిన్స్ ను బ్లాక్ మార్కెట్ లో అధికధరలకు అమ్ముకుంటున్నారు. ఇది మనం కోవిద్ మహమ్మారిని ఎదుర్కొంటున్న తీరు , దీనిని తీవ్రంగా గర్హించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలు జాగృతం కావాలి. ముఖ్యంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది కోవిడ్ కు అడ్డుకట్ట వేయడం అంటే అందరం జాగ్రత్తగా ఉండడమే.