అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు విద్యార్థి ఉద్యమంలో గొప్ప వరవడి అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సరసం డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల గుణ సంపదను చూసి ఏబీవీపీ గొప్పతనం తెలుసుకోవచ్చు అని ఆయన విశ్లేషించారు. విద్యార్థి ఉద్యమంలో మూడు సూత్రాలు ప్రధానమైనవి అని ఆయన వివరించారు.
ఏబీవీపీ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయ భవనం ‘యశ్వంత్’ని ఢిల్లీలో డాక్టర్ మోహన్ జీ ప్రారంభించారు.
ఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రదేశంలో విద్యార్థుల సహకారంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఒక పెద్ద విజయమని చెప్పారు . యశ్వంతరావుజీ జన్మ శతాబ్ది సంవత్సరంలో స్థాపించిన ఈ కార్యాలయానికి ‘యశ్వంత్’ అని పేరు పెట్టడం పట్ల సంతోషం ప్రకటించారు. యశ్వంతరావు సీల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన స్ఫూర్తితో, ఈ విద్యార్ధి పరిషత్ కార్యాలయం నిర్మించారని అభినందించారు.
దీనిలో ‘జ్ఞానం, శీలం, ఐక్యత’ అనే ప్రాథమిక స్ఫూర్తి అంతర్లీనంగా ఉందని పేర్కొంటూ విద్యార్థి ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని కార్యకర్తలను చూడాలని, వారంతా కలిస్తేనే ఒక సమగ్రతను కలిగిస్తారని చెప్పారు. కార్యకర్తల అనుభవాల ఆధారంగా ఓ సంస్థ రూపుదిద్దుకుందని పేర్కొంటూ సంక్షోభ సమయాల్లో కూడా జాతీయ పరిగణన ఆధారంగా పనిచేస్తూ వస్తున్నదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సహా సర్ కార్యవహ్ లు డాక్టర్ కృష్ణ గోపాల్, ముకుంద్ సిఆర్ యెస్, అరుణ్ కుమార్, ఎబివిపి సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ వంటి ప్రముఖంగా హాజరయ్యారు.