
Kamareddy Collector Jitesh Patil
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ జీతేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎవరి భూములూ లాక్కోవడం లేదని అన్నారు. మాస్టర్ ముసాయిదా దశలోనే ఉందని…ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్న కలెక్టర్ అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే ముందుకెళ్తామన్నారు. తమ అభ్యంతరం తెలిపే హక్కు రైతులందరికీ ఉందన్నారు జీతేశ్ పాటిల్.అభ్యంతరాల తరువాత మార్పులు, చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అసలైతే నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని… జోన్ ప్రకటించినంతమాత్రాన భూసేకరణ జరగదని స్పష్టత ఇచ్చారు. భూములు పోతాయని కొందరు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.