ప్రేమను ఒప్పుకోని కారణంగా అంకిత అనే యువతిని ..షారుఖ్ హుస్సేన్ అనే యువకుడు సజీవదహనం చేసిన ఘటన దుమారం రేపుతోంది. అంకిత నిద్రిస్తుండగా కిటికీలోంచి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఐదురోజులపాటు ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడిన అంకిత తెల్లవారుజామున మృతి చెందింది. దేశవ్యాప్తంగా అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన. దోషిని కఠినంగాశిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ వర్గం మీడియా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుకనిపిస్తోంది. ఇండియాటుడే గ్రూప్ అత్యుత్సాహాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఈ ఘటన గురించి వార్తలు రాస్తూ…నేరస్తుడి పేరు షారుఖ్ అయితే అభిషేక్ గా పేర్కొంది ఆ మీడియా సంస్థ.
అయితే నెటిజన్లు మీడియాచేసిన పనిని ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించేసరికి వెనక్కి తగ్గింది. తరువాత అతని అసలు పేరుపెట్టింది. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నవ్వుతూకనిపించాడు షారుఖ్. ఇలాంటి దుర్మార్గుడిని అస్సలు వదిలేయవద్దని..కఠినంగా శిక్షించాలనిఅంకిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Archive link :
https://twitter.com/AskAnshul/status/1564189476150161409?s=20&t=ywboLSGW1H–k8MRMKKLog