లద్దాక్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు భారత సైనికులు చనిపోయారు.
26 మంది సైనికులు పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టర్ ఫార్వర్డ్ లొకేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో…వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ నదిలో పడిపోయింది. సైనికులందరికీ గాయాలయ్యాయి. అందర్నీ పార్తాపూర్లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.