రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని ఏబీవీపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ్డారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేకుండా నడిపిస్తున్న ఇంటర్ కళాశాలలను రద్దు చేయాలని, అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని , ఫీ రెగ్యులేషన్ కమిటీ వేసి దానికి చట్టబద్దత కల్పించాలని, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టింగ్ లను భర్తీ చేయాలని ABVP డిమాండ్ చేసింది. . రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య పూరిత వైఖరి వీడి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఇదే డిమాండ్ తో నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో కి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన ఏబీవీపి విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.