ప్రభుత్వ నిబంధనలనూ ఉల్లంఘిస్తున్నాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో…ప్రభుత్వం మార్చి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు 300 మందికి పైగా విద్యార్థులను ప్రత్యేక బోధనల పేరిట సమీకరించి, వారిని మొయినాబాద్ వద్దనున్న ఆజాద్ ఇంజనీరింగ్ పాఠశాలలో ఉంచినట్టు ఏబీవీపీ వాళ్లకు సమాచారం అందింది. దీంతో ఏబీవీపీ విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ, అవేమీ తమకు వర్తించవన్న రీతిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు వ్యవహరిస్తున్నాయని, విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని ఇక్కడ నిర్బంధించారని ఏబీవీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని, బాధ్యులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీరుపై అనేక విమర్శలు తలెత్తాయి. గురుకులాల్లో స్వేరోల మితిమీరిన పెత్తనం, హిందూ వ్యతిరేక కార్యకలాపాలపై నివేదిక అందించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా…