మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగి, ఏటా లక్షా 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. మేం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు సాధికారత కల్పించడం. చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి. ఈ విషయంగా మేం ఎంత ప్రయత్నించినా ఓ వర్గం రైతుల్ని ఒప్పించలేకపోయాం. మా ప్రయత్నాల్లో కొన్ని లోటుపాట్లుండవచ్చు. దాని వల్ల రైతులకు చట్టాల గురించి వివరించలేకపోయాం. దేశ ప్రజలకు నేను క్షమాపణ చెబుతున్నా. వ్యవసాయానికి సంబంధించి కొత్త ప్యానల్ నిర్ణయాలు తీసుకుంటుంది.
– నరేంద్ర మోదీ