కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వెనక భారీ కసరత్తే జరిగిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ అన్నారు. 2019లో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టికల్ రద్దు-హోంమంత్రి అమిత్ షా పాత్రపై ఆయన రాసిన “కిత్నే గాజీ ఆయే..కిత్నే గాజీ గయే” పుస్తకంలో ప్రస్తావించారు థిల్లాన్. 2109 జూన్ 26న ఉదయం ఏడుగంటలకు అమిత్ షా తనను పిలిపించుకున్నారని…ఆర్టికల్ రద్దు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశాలమీద చర్చించామని, పాక్ స్పందన ఎలా ఉండవచ్చనేదానిపైనా మాట్లాడుకున్నామని ఆయన అన్నారు. ఈ అంశాలన్నీ రాబోయే తన పుస్తకంలో పొందుపరిచినట్టు థిల్లాన్ తెలిపారు.370 రద్దు నిర్ణయం వెనక..ఆయనెంతో కసరత్తు చేశారని, విస్తృతమైన పరిశోధన చేశారని, స్పష్టతతో ఉన్నారని అప్పుడే అర్థమైందనీ చెప్పుకొచ్చారు. 370 రద్దుపై శ్రీనగర్లో జరిగినన ఆఖరి సమావేశం కూడా అదేనని థిల్లాన్ అన్నారు.2019 ఆగస్టు 5న 370 ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.