బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఈడీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రుజీరాకు గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 21, 22 తేదీల్లో విచారణకు హాజరుకావాలని బెనర్జీ దంపతులకు సమన్లు పంపింది ఈడీ. అయితే సమన్లకు వ్యతిరేకంగా వాళ్లు డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమను ఢిల్లీకి రప్పించడం కాక కోల్ కతాలో విచారించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరగా…ఢిల్లీ హైకోర్టు అనుమతించలేదు. అభిషేక్ బెనర్జీని మార్చిలో ఈడీ కార్యాలయంలో అధికారులు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. ఆయన భార్య మాత్రం విచారణకు రాలేదు. దుర్గాపూర్-అసన్సోల్ బెల్ట్, జార్ఖండ్ ల నుంచి అక్రమంగా బొగ్గును వెలికితీసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది.