జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరుపున వాదించిన న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో చనిపోయారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్ నాథ్ వాదిస్తున్నారు. ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభయ్ మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. ఆ కేసులో ఆగస్టు 4వతేదీన కోర్టులో ముస్లింల తరపున అభయ్ నాథ్ వాదనలు వినిపించాల్సి ఉంది.