ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ పై చర్యలు తీసుకున్న భారత్ ను అభినందించింది ఇస్లామిక్ దేశం ఇరాన్. ఈ వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్డోల్లహియన్ జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ తో సమావేశం అయ్యారు. నూపుర్ వ్యాఖ్యలపై ప్రస్తావించగా..దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్ సమాధానం తమకు సంతృప్తినిచ్చిందని…. ప్రవక్త మహమ్మద్ పట్ల భారత ప్రభుత్వానికి, భారత ప్రభుత్వ అధికారులు, నేతలకు గౌరవం ఉందని దోవల్ తనతో చెప్పినట్టు హుస్సేన్ వెల్లడించారు. భారత్ తీసుకున్న చర్యల పట్ల ముస్లింలు సంతృప్తిగానే ఉన్నారని అమిర్ అబ్డొల్లాహియాన్ చెప్పినట్లు సమాచారం. దేశంలో వివిధ మతాలను పాటించేవారి మధ్య మతపరమైన సహనం, చారిత్రక సహజీవనం, స్నేహభావాలనూ ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రశంసించారు.