ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు స్వాతి మాలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోనే తన మీద వేధింపులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా వివాదాస్పదమైన బిభవ కుమార్ మీద ఆమె ఈ ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా బిభవ కుమార్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఆయన నియామకం చట్ట విరుద్ధం అని ఢిల్లీ విజిలెన్స్ విభాగం తేల్చి చెప్పింది. అలాగే కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన పాత్ర ఉంది . ఈ మేరకు బిభవ కుమార్ కు ఈడి సమన్లు కూడా ఇచ్చింది
కొంతకాలంగా బిభవకుమార్ ఉద్దేశపూర్వకంగానే స్వాతి మాలివాల్ వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భర్త నుంచి విడాకులు తీసుకుని ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్వాతి నేరుగా స్థానిక సివిలైన్స్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సన్నిహితుడు కుమార్ తనపై దాడి చేస్తున్నట్లు ఫోన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ పరిస్థితులు వివరించాక వెళ్ళిపోయారు. అనంతరం స్వాతి మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటన పరిస్థితుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది.
వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పటి నుంచి స్వాతి మాలివాల్ ముఖ్య పాత్ర పోషించారు .అందుకే అధికారంలోకి రాగానే ఆమెకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని అప్పగించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అరవింద కేజ్రీవాల్ చుట్టూ చేరుతున్న ముఠా సరైన వాళ్ళు కాదని ,,, వాళ్లే కేజ్రీవాల్ ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి . ఈ క్రమంలో స్వాతి మాలివాల్ చేస్తున్న ఆరోపణలు సహజంగానే ఆప్ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి.