ఓ కాంట్రాక్టర్ తనకు లంచం ఇవ్వజూపాడంటూ ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అసెంబ్లీలో నోట్లకట్టలు ప్రదర్శించడం కలకలం రేపింది. సిటీ గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన ప్రైవేటు కాంట్రాక్టురు ఒకరు తనకు లంచం ఇంచేందుకు ప్రయత్నించారని మహేంద్ర గోయల్ ఆరోపించారు. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రిలో తాత్కాలిక స్టాఫ్ నియామకాల్లో అవకతకలు చోటుచేసుకున్నాయని… అయితే కొందరు తన నోరు మూయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బెదిరింపులకుతాను భయపడబోనని అన్నారు.అదే సమయంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని సభదృష్టికి తీసుకెళ్లగా… స్పందించిన స్పీకర్ ఆయన ఫిర్యాదును పిటీషన్స్ కమిటీ ఆఫ్ హౌస్కు అప్పగించారు.
https://twitter.com/ANI/status/1615611692746170368?s=20&t=wmzutvV_pJ1aDQrxUTNtsQ