ఆమె ఓ ఎమ్మెల్యే. అబద్దాలాడి అడ్డంగా దొరికింది. డిల్లీ మోడల్ విద్యాబోధన గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కేరళనుంచి అధికారులు వచ్చారని చెప్పుకొచ్చింది. కానీ అదంతా అవాస్తవం అని తేలింది. దీంతో ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తోంది డిల్లీ బీజేపీ శాఖ. కేరళ నుంచి ఎలాంటి అధికారుల బృందం రాకుండానే తప్పుదోవ పట్టించే ప్రకటన చేసిన అతిషి వ్యాఖ్యలపై విద్యామంత్రి, డిప్యూటీ సీఎం సిసోడియా వివరణ ఇవ్వాలని విపక్క్షం డిమాండ్ చేసింది. “రాజకీయ జిమ్మిక్కు కోసం రాష్ట్ర ప్రోటోకాల్ను ఉల్లంఘించేలా అతిషి ఇలాంటి తప్పుడు వాదనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది” అని మండిపడుతోంది. అసలైతే అతిషి స్టేట్ మెంట్ ను కేరళ విద్యామంత్రి తోసిపుచ్చడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అతిషి పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వ విద్యా విధానం గురించి తెలుసుకోవడానికి తమ అధికారులు ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదని కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి ట్విట్టర్లో పేర్కొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)