కాశ్మీరీ హిందువుల మారణహోమాన్ని అపహాస్యం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వివాదాస్పద ప్రసంగం వైరల్ అవుతోంది. జూతీ అంటే నకిలీ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్ ను పేర్కొన్నాడు కేజ్రీ. టాక్స్ ఫ్రీ చేసేందుకు నిరాకరించిన ఆయన…అందరూ ఉచితంగా చూసేలా యూట్యూబ్ లో పెట్టాలని వివేక్ రంజన్ కు సలహా ఇచ్చారు. అయితే మారణహోమాన్నిఅవాస్తవంగా చెబుతూ అపహాస్యం చేసిన కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది.
https://twitter.com/AamAadmiParty/status/1506961996771901441?s=20&t=uR_OFeYN2Ea-OqzhO1K0ow
ఆ సందర్భంగా కేజ్రీ మాటలకు విరగబడి నవ్విన మహిళా నాయకురాలు రాఖీ బిర్లా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. డిప్యూటీ స్పీకర్, గతంలో మహిళాసంక్షేమం, సామాజిక న్యాయ శాఖమంత్రిగా పనిచేసిన ఆమె ..కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి… హిందువుల ఊచకోత గురించి కేజ్రీవాల్ అపహాస్యం చేస్తూ మాట్లాడుతుంటే పడీపడీ నవ్వారు. ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతూ రాఖీమీద విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆమె తండ్రిపై వేధింపు ఆరోపణల కేసు నమోదైంది. అంతేకాదు గతంలో ఆమె పై వారి కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలు, కేసులు వార్తల్లో నిలుస్తున్నాయి.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల ముందు 2016లో రాఖీబిర్లా తండ్రి భూపీందర్ తనకు టికెట్ ఇప్పిస్తానని ప్రలోభపెట్టి అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భూపీందర్ తో పాటు మరో ఆప్ నాయకుడు రామ్ ప్రతాప్ గోయల్ పైనా ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపిసి సెక్షన్ 376 డి (గ్యాంగ్ రేప్) , 506 (బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 5, 2016న కన్నాట్ ప్లేస్లోని ఒక హోటల్లో గోయల్ ,భూపీందర్ లు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ దృశ్యాల్ని వీడియో తీసి తన జీవితం నాశనం చేశారనీ అంటోంది.
అంతకుముందు 2015లో, రాఖీ బిర్లా మరదలు కూడా ఆమె సోదరుడైన విక్రమ్ పై గృహహింస ఆరోపణలు చేసింది. కేసు కూడా పెట్టింది. అయితే మధ్యవర్తుల సూచనతో మరోసారి వేధిస్తే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరిస్తూ ఫిర్యాదు వెనక్కి తీసుకుంది ప్రియాంక. తరువాత అతనితో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కశ్మీరీల ఊచకోత , తరిమివేత పై అపహాస్యం చేస్తూ నవ్వడంపై చాలామంది ఆమెమీద విరుచుపడ్డారు. ఇప్పుడిక ఆమె కుటుంబసభ్యుల మీద కేసులు బయటకి రావడంతో మరింతగా రాఖీని ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు, నెటిజన్లు.