వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనింటితో పాటు పలు ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. సోదాల్లో 12 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఎమ్మెల్యే సన్నిహితుడు హమీద్ అలీఖాన్ నుంచి లైసెన్స్ లేని బెరెట్టా పిస్టల్ నూ స్వాధీనం చేసుకున్నారు.సోదాల్లో అతనిపై నేరారోపణలకు సంబంధించిన సాక్ష్యాలనూ గుర్తించినట్టు తెలిసింది. అంతకుముందు ఆయన్ని విచారణకు పిలిచారు. ఆరోపణలకు సంబంధించినసాక్ష్యాధారాలు గుర్తించిన ఏసీబీ అవినీతి నిరోధక చట్టం 2020 కింద కేసు నమోదు చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన రెండేళ్ల నాటి కేసులో విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నేత అమానతుల్లా ఖాన్కు ఢిల్లీ ఏసీబీ గురువారం సమన్లు జారీ చేసింది. అయితే ఏసీబీ నుంచి వచ్చిన నోటీసుపై ట్విట్టర్లో స్పందించిన ఎమ్మెల్యే …వక్ఫ్ బోర్డ్ కొత్త కార్యాలయం కడుతున్నందునే పిలుస్తున్నట్టు తెలిపారు. ఆప్ వ్యక్తిగత సహాయకుడిని మూడురోజల క్రితమే అధుపులోకి తీసుకున్నారు.