ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆప్. 250 వార్డుల్లో 134 వార్డుల్లో ఆమ్ ఆద్మీ ఆభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలు దక్కించుకుంది.ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది. కేవలం 9 స్థానాలు మాత్రమే హస్తం పార్టీ ఖాతాలో చేరాయి. 3 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. 1958లో డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కాగా 2012లో నాటి సీఎం షీలా దీక్షిత్ మూడు కార్పొరేషన్లుగా విడదీశారు. అయితే ఈసారి మళ్లీ ఎంసీడీని ఒక్కటిగా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించారు. 15ఏళ్లపాటు ఢిల్లీ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లో ఉంది. ఈసారి మాత్రం ఢిల్లీ ప్రజలు ఆప్ వైపు మొగ్గారు.