ఇటీవల కాలంలో క్రైస్తవ చర్చిలు రెచ్చిపోతున్నాయి. అమాయకుల బలహీనతలు ఆసరాగా తీసుకుని దౌర్జన్యాల దారుణాలకు తెగబడుతున్నాయి. ఇటువంటి దారుణాల గురించి మీడియాలో మాత్రం పెద్దగా వివరాలు బయటకు రావడం లేదు . అదే ఏదైనా ఒక గుడిలో కానీ మఠం లో కానీ చిన్న సంఘటన జరిగినా భయంకరంగా పబ్లిసిటీ ఇచ్చేస్తారు.
అమాయకుడిని వేధించి, చనిపోయేదాకా దెబ్బలు కొట్టిన పాస్టర్ ఉదంతం ఇది. గురుదాస్ పూర్ జిల్లాలోని సంఘపురాకు చెందిన శామ్యూల్ మాసిహ్ అనే దినసరి కూలీ నిత్యం అనారోగ్యానికి గురయి కేకలు వేస్తుండేవాడు. దాంతో కుటుంబ సభ్యులు స్థానిక పాస్టర్ జాకోబ్ మాసి్హను సంప్రదించగా .. వారి ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశాడు.
అతనికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించడానికి అతణ్ని కొడుతామని చెప్పాడు. కొట్టినా ఏమీ కాదని భరోసా ఇచ్చాడు. అనంతరం ఆయనతో పాటు మరో ఎనిమిది మంది శామ్యూల్ను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజున శవానికి సమాధి చేశారు. కానీ రెండు రోజుల తరువాత శామ్యూల్ తల్లి, భార్య పాస్టరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాధి నుంచి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. పాస్టర్తో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు.
మన మీడియా సంస్థలు మాత్రం దీనిని గప్ చుప్ గా దాచేశాయి.