పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో సదానందం అనే ఓ కసాయి కన్నబిడ్డనే పొట్టన పెట్టుకున్నాడు. 11ఏళ్ళ రజితను గొడ్డలితో నరికి చంపాడు.దారుణంగా చంపాడు. నీలదీసిన మరో వ్యక్తిపైనా హత్యాయత్నం చేశాడు.
సదానందం గతంలో తన భార్యను ఉరి వేసి చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని తెలిసింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న మంథని పోలీసులు స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే
పోలీసు వాహనంలో స్టేషన్ కి తలుస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తామే శిక్షిస్తామని వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో
పోలీసులకు గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది.
గ్రామస్తులు పోలీస్ వాహనంపై దాడి చేశారు. మహిళాపోలీసులపై గ్రామ మహిళలు కారంపొడి చల్లారు. వారిని తప్పిస్తూ నిందితుడిని తీసుకెళ్లారు పోలీసులు.