భారత్ పై జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర గురించి తెలుసుకోండి. ఇది చాలా పెద్ద పోస్ట్. దీనిని ఓపిగ్గా చదివి అర్థం చేసుకొని నలుగురితో పంచుకోండి.
గతంలో ఢిల్లీ లో జరిగిన CAA వ్యతిరేక ప్రదర్శనలు కానీయండి లేదా గత సంవత్సరం నుండి ఢిల్లీ బోర్డర్సలో జరుగుతున్న రైతుల ఆందోళనలు కానీయండి అవి ఏదో యాదృచ్చికంగా ఆ టైంలో మొదలైనవి కాదు అని దీని వెనుక విదేశీ శక్తులు ఖచ్చితంగా ఉన్నాయని ఈ కింద విషయాలు చదివితే మీకు అర్థమవుతుంది.
ఈ మేటర్ రీసెర్చ్ చేసి ఇంగ్లీష్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది విజయ్ పటేల్. నేను తెలుగులోకి అనువాదం చేసి పిక్చర్ స్లైడ్స్ తయారు చేశాను.
ప్రతీ పేరాకు రుజువుగా అదే నెంబర్ తో స్లైడ్ తయారు చేశాను. అవి క్రింద పెట్టాను. చూడండి.
విజయ్ పటేల్ మాటల్లోనే..చదవండి..
“ఈ రోజు నేను CAA మరియు రైతు నిరసనలు మరియు మొన్న జరిగిన ” గ్లోబల్ హిందూత్వ కూల్చివేత కాన్ఫరెన్స్ “వంటి ప్రణాళికాబద్ధమైన నిరసనల వెనుక వున్నా రూపకర్తల ముసుగును తొలగిస్తాను.”
1. 2011 లో ఆమెరికా లో లో కమ్యూనిస్టులు ‘ఆక్రమణ ఉద్యమం’ అంటే occupy moment ప్రారంభించారు. వారు అనేక నగరాలను ఆక్రమించారు. ‘వాల్ స్ట్రీట్ను ఆక్రమించుకోండి’ అనేది ఆ సమయంలో అతిపెద్ద మరియు దీర్ఘకాలిక నిరసన. నిరసనకారులు నెలల తరబడి వాల్ స్ట్రీట్ నీ ఆక్రమించారు.

2. తల్లిదండ్రులు కమ్యూనిస్ట్ లు అయిన మరియు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ “అనియా లూంబా” ఈ నిరసనలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె కమ్యూనిస్ట్ భర్త సువీర్ కౌల్ కూడా ఇందులో భాగమే.

3. క్రింద ఇచ్చిన 3వ చిత్రంలో చూడండి. 2013లో మోడీ ఇంకా కేంద్రంలో అధికారంలోకి రాక ముందే ఈ సువిర్ కౌల్ మోడీ వ్యతిరేకి.

4. ఈ జంట ఆగస్టు 2019 లో ‘భారతదేశంలో ఫాసిజానికి వ్యతిరేకంగా కూటమి’ (CAFI) “coaliation against fascism in india ” అనే అనేక సందేహాస్పద సంస్థల గొడుగు సంస్థను తయారు చేసింది. వారి భాగస్వామి సంస్థల జాబితాను చూడండి. హిందూ ద్వేషి మరియు చరిత్రకారురాలు ఆడ్రీ ట్రుష్కే కూడా ఇందులో భాగస్వామి.

5. సెప్టెంబర్ 2019 లో నరేంద్ర మోడీ USA సందర్శించారు. ఈ కమ్యూనిస్ట్ CAFI మరియు వారి భాగస్వాములు మోడీ జీకి వ్యతిరేకంగా నిరసనను నిర్వహించారు. ఈ నిరసనలో వారి డిమాండ్స్ ఏమిటో తెలుసా? కాశ్మీర్ లో మిలిటరీ అణిచివేత పోవాలి, ఆర్టికల్ 370 మళ్లీ పునరుద్ధరించాలి, భారత్ లో ముస్లిం లు, దళితులు, ఆదివాసీల నరికివేత లు ఆగాలి, (నక్సల్స్)రాజకీయ ఖైదీలను విడిచి పెట్టాలి..అనేవి కొన్ని డిమాండ్స్. వీరి అజెండా ఏమిటో అర్థం అయింది కదా? 5వ ఫోటో

6. ఈ అనియా లూంబా మరియు ఇతర NRI కమ్యూనిస్టులందరూ కమ్యూనిస్ట్ పార్టీ CPI (M) తో చేతులు కలపి పని చేస్తున్నారు.
భారతదేశంలో జర్నలిజం మరియు విద్య వంటి విభిన్న రంగాలలో పనిచేస్తున్న ఇతర భారతీయ కమ్యూనిస్టులతో కూడా ఆమె బాగా కనెక్ట్ అయ్యారు. Reclaim india అనే కాన్ఫరెన్స్ కి భారత్ నుండి ఎవరు ఎవరు అటెండ్ అయ్యారో క్రింద 6వ బొమ్మలో చూడండి. ఏచూరి, ప్రశాంత్ భూషణ్, ఇందిరా జైసింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. మొ.వారు

7.ఇప్పుడు 2011 లో అమెరికాలో ఆక్రమిత ఉద్యమంలో ఆమె పాత్రపై అనియా లూంబా ఇంటర్వ్యూను మీకు చూపుతాను. నిరసనలలో మహిళలను ఉపయోగించుకునే వ్యూహం గురించి ఆమె అప్పుడే మాట్లాడారు! 7వ ఫోటో చూడండి.

8. CAA మరియు రైతు నిరసనలలో అదే వ్యూహం అమలు చేయబడింది. అంటే ఇది కేవలం యాదృచ్చికమా? 8వ ఫోటో చూడండి.

9. రైతు నిరసన లేదా CAA నిరసన అయినా, వాటిని కమ్యూనిస్ట్ సంస్థలు ప్రారంభించాయి మరియు వారి వారి వ్యక్తిగత లక్ష్యాల మేరకు ఎక్కువ మంది వ్యక్తులు మరియు సంస్థలు వీటిలో చేరాయి. ఉదాహరణకు రైతు నిరసనలలో ఖలిస్తానీలు పాల్గొంటూ వుంటే CAA నిరసనలో ముస్లిం సంస్థలు పాలుగొన్నాయి.

10. పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రైతులకు కొత్త వ్యవసాయ చట్టం గురించి తప్పుగా సమాచారం ఇవ్వడం ప్రారంభించాయి పంజాబ్, హరియానా మరియు యుపిలలో కమ్యూనిస్ట్ రైతు సంస్థలు . 2011లో అమెరికాలో చేసినట్లే ఇక్కడ ఢిల్లీ సరిహద్దులను ఆక్రమించడానికి ప్రణాళికాబద్ధమైన వ్యూహం ప్రకారం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత వారు సరిహద్దులను ఆక్రమించారు.

11. “వాల్ స్ట్రీట్ అక్రమించండి” నిరసన అప్పుడు వారు నివాసం ఉండడానికి ఒక టెంట్ సిటీ నిర్మించారు. వారి స్వంత వార్తాపత్రిక తయారు చేసుకున్నారు. అలాగే వారికి వైద్య సదుపాయం ఉంది. నిరసన స్థలంలో వారికి లైబ్రరీ ఏర్పాటు ఉంది.

12. రైతు నిరసనలలో కూడా అదే రకంగా అన్ని సమకూర్చబడ్డాయి. ఒక ముందస్తు ఖచ్చితమైన పక్కా ప్రణాళిక లేకుండా ఇది సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ఇదంతా కేవలం యాదృచ్చికం అని మీరు అనుకుంటున్నారా?

13. ఈ రైతు నిరసన ఉద్యమంలో ఉన్న వార్తాపత్రిక ట్రాలీ టైమ్స్ నడుపుతున్న అమ్మాయి తల్లిదండ్రులు కమ్యునిస్టులు. ఆమె తల్లి జస్బీర్ కౌర్ కమ్యూనిస్ట్ రైతు సంస్థ నాయకురాలు.

14. వైర్, NDTV, న్యూస్క్లిక్ మరియు ఇతర వామపక్ష ప్రచార వార్తా సంస్థలు అనియా లూంబా వ్యూహం ప్రకారం ఈ రకమైన నిరసనకు పెద్దగా మద్దత్తు ఇచ్చి మహిళలలను కీర్తించాయి.

15. ” వాల్ స్ట్రీట్ అక్రమించండి” ఉద్యమం వారు భారీ ర్యాలీని ప్లాన్ చేసారు. దానికి ‘డే ఆఫ్ యాక్షన్’ అని పేరు పెట్టారు.అదేవిధంగా భారతదేశంలో ఈ నకిలీ రైతులు ‘గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్’ ప్లాన్ చేసారు మరియు జనవరి 26 న ఢిల్లీలో ర్యాలీ చేసి విధ్వంసం సృష్టించారు.

* ఈ ముఠా అనియా లూంబా, కమ్యూనిస్ట్ రాజకీయ నాయకులు, కమ్యూనిస్ట్ ప్రొఫెసర్లు, కమ్యునిస్ట్ విద్యార్థులు, కమ్యూనిస్ట్ ప్రచార వార్తల వెబ్సైట్లు మరియు వారి జర్నలిస్టులు కలసి CAA మరియు రైతు నిరసనల వంటి బాగా ప్రణాళికాబద్ధమైన కృత్రిమ నిరసనల నిర్మాణం చేశారు అని తెలుస్తోంది కదా!
ఈ అనీయా లూంబా మరియు ఆమె గ్యాంగ్ ఈ మధ్య జరిగిన హిందూ వ్యతిరేక ఈవెంట్ “గ్లోబల్ హిందూత్వను కూల్చడం” వెనుక కూడా ఉన్నారు.
ఈ కమ్యునిస్టు లు 24 గంటలూ తిట్టుకునే పెట్టుబడి దారీ అమెరికాలోనే ఇలా కుట్రలు సాగించగలరు. ఎందుకంటే వీరు ప్రజాస్వామ్య దేశాల్లో అన్ని హక్కులు అనుభవిస్తూ అక్కడ ప్రజలచే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను ఫాసిస్టు ప్రభుత్వాలు అని ఆరోపిస్తూ అవకాశం దొరికితే వాటిని నిరసనలు, హింసా మార్గం ద్వారా కూలదోసి వారి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు అమితంగా ప్రేమించే కమ్యునిస్ట్ రాజ్యాలు అయిన చైనా రష్యా మొదలగు వాటిలో ఈ వెధవ లాగా ఉద్యమాలు చేస్తే కాల్చి పారేస్తారు.. ఒక వేళ నిజంగా వీరు ఎక్కడైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే చైనా లాగా అసలైన నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు.
ఈ పెట్టు బడిదారీ దేశాల్లో ఉన్న కొద్దీ మంది సానుభూతి పరులతో కలిసి భారతీయ కమ్యునిస్ట్ లు ఇన్ని కుట్రలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ డాడీ చైనా మన భారత్ ని ఇబ్బంది పెట్టడానికి వీరిని పావులుగా ఎలా వాడుకుంటుందో మీరు ఊహించండి.
అసలు ఒక్క చిన్న రాష్ట్రం కేరళలో మాత్రమే అధికారంలో ఉన్న ఈ కమ్యునిస్ట్ లకు వందల కోట్లు ఖర్చు అయ్యే ఇన్ని రోజులు ఇంత విలాస వంతమైన ఉద్యమాలు నడపడానికి ఇంత డబ్బు ఎవరు ఇస్తున్నారు? జార్జ్ సారోసా? లేదా చైనా? ఖాలిస్తాన్ సంస్థలు ?