సిబిఐ, ED ఏకపక్ష దాడులు చేయకుండా అంటే సోదాలు,అరెస్ట్,రిమాండ్, బెయిల్ లాంటి అంశాల మీద మార్గ దర్శక సూత్రాలని ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.మొత్తం 14 ప్రతిపక్షాలు కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి ! కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఆయాపార్టీలన్నీ సుప్రీం కోర్టుని కోరాయి. అయితే ఇలాంటి విషయాల్లో కలగ చేసుకోబోమంటూ 14 పార్టీల అభ్యర్ధనని తోసి పుచ్చింది సుప్రీం. ఇక ఔరంగాబాద్ ని ఛత్రపతి శంభాజీ నగర్ గా పేరు మార్చడం మీద కలగుచేసుకోమంటూ వేసిన పిటిషన్ ని కూడా కొట్టివేసింది!