భారతదేశము ప్రధానంగా గ్రామాల మయం. అందుచేత గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి కలిగితే దేశం బాగుపడుతుందని ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు అభిప్రాయపడుతూ ఉంటాయి. ఈ స్ఫూర్తితో ఏర్పాటైన గ్రామ భారతి దేశవ్యాప్తంగా గ్రామీణ క్షేత్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల వికాసం కోసం గ్రామ భారతి ఎనలేని కృషి చేస్తోంది.
గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న గ్రామ భారతి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మూలం సంత అనే పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ తార్నాక లోని మర్రి కృష్ణారెడ్డి హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు అయింది . ఈనెల 13వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి దాకా ఇది కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చిన స్పందనను బట్టి దీనిని వారాంతపు సంత లేదా మాసాంతపు సంత గా కొనసాగించాలని గ్రామ భారతి భావిస్తోంది.
ఇందులో ప్రధానంగా..గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మిద్దెతోట, దేశీ విత్తనాలు, మొక్కలు పెడుతున్నారు. అటు,, తినుబండారాలు, వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. మరోవైపు, దేశం, ధర్మం, ప్రకృతి వ్యవసాయం మరియు పాడి పై పుస్తకాలు,,- ఆయుర్వేద, పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు ఉంటాయి. అలాగే గో ఆధారిత ఉత్పత్తులతో ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టిస్తున్నారు. చేనేత దుస్తులు, వస్త్రాలు, కుల వృత్తులు, చేతి వృత్తులు ఉత్పత్తుల కోసం స్టాల్స్ ఉంటాయి. ప్రకృతి మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు, మిల్లెట్ ఉత్పత్తులు కు పెద్దపీట వేస్తున్నారు. వీటితోపాటు
రైతులకు, చిన్న వ్యాపారస్తులకు ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులోకి తెస్తున్నారు.
గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నది వాస్తవం అందుచేత నగర ప్రజలు ఇటువంటి మూలం సంత కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే బాగుంటుంది. దీని ద్వారా చాలా చౌక ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు నగర ప్రజలకు అందుతాయి. అటు రైతులకు గ్రామీణ ప్రజలకు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలవుతుంది. అంతిమంగా గ్రామీణ వికాసం సాధ్యమవుతుంది.