కాంగ్రెస్ పార్టీలో డబ్బు లావాదేవీలు కొంతమంది కొంపముంచుతున్నాయి. హై కమాండ్ నుంచి పంపించిన డబ్బులు మధ్యలో ఉన్న నాయకుల దగ్గర ఆగిపోతుండగా,, స్థానికులు నుంచి వసూలు చేస్తున్న చందాలు కిందిస్థాయి నేతలు నొక్కేస్తున్నారు. దీంతో కొంతమంది పార్టీ అభ్యర్థులు డబ్బు ఇవ్వమని మొత్తుకుంటున్నారు.
తాజాగా ఒడిశాలోని పూరి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి కుండ బద్దలు కొట్టేశారు. పార్టీ వర్గాల్లో ఆర్థిక పరంగా చాలా చికాకులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అధిష్టానం నుంచి నగదు వస్తుందని చెప్పారు కానీ ఎటువంటి డబ్బు అందలేదని చెప్పారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టినా కానీ, అనుకున్నంత ఫలితం లేదని వివరించారు . మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో డబ్బుకు సంబంధించి చాలా తలనొప్పులు ఉన్నాయని సుచరిత మహంతి వివరించారు.
వాస్తవానికి సుచరిత ఒడిశాలో పేరు పొందిన మహిళా జర్నలిస్టు. కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు. తాజాగా టికెట్ వదులుకుంటున్నట్లుగా.. నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ కి మెయిల్ పెట్టారు. ఈ మెయిల్ లేఖ బయటకు రావడంతో కాంగ్రెస్ లో ఉండే డబ్బు గొడవలన్నీ బయటకు వచ్చేశాయి.