తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేడర్ కేటాయింపు వివాదంపై ఉన్నతి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపేయాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపేస్తూ తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.