కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ శకలాలు హిందూమహాసముద్రంలో కూలాయి.భూ వాతావరణంలోకి రాగానే శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. చిన్న చిన్న భాగాలుగా సముద్రంలో పడ్డాయి. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడుతాయని చైనా అంచనా వేసిన ప్రాంతంలోనే పడ్డాయి. ఆ ప్రాంతం మాల్దీవులకు దగ్గర్లోనే ఉంది. కుప్పకూలుతున్న శకలాల దృశ్యాలను కొందరు కెమెరాల్లో బంధించారు. ఆదృశ్యాలు ఇవిగో.