రోజులు గడిచే కొద్దీ బంగ్లాదేశ్ సంబంధించి భయంకర నిజాలు బయట పడుతున్నాయి. చాలా పెద్ద కుట్రతోని బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగిందని అర్థం అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా బయటపెట్టారు.
హసీనా సహా కుటుంబ సభ్యులను మొత్తంగా హతమార్చేందుకు ప్లాన్ చేశారని ఆమె వెల్లడించారు.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో మొదటిసారి వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు . మహ్మద్ యూనుస్ సర్కారు నరమేధానికి పాల్పడుతున్నట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ది అధికార వ్యామోహం అని, బంగ్లాదేశ్లోని దేవాలయాలు మీద దాడి జరుగుతోందని వివరించారు . ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హసీనా మండిపడ్డారు.
అనేకమంది ప్రజాస్వామ్య వాదులను హత మార్చేందుకు కుట్ర జరిగిందని ఆమె వివరించారు. హిందువులు సహా మైనారిటీల రక్షణలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అల్లరి మూకలు అడ్డంగా పెట్టుకుని యునుస్ గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు.
కుట్ర జరిగిన రోజు ఏమి జరిగిందో షేక్ హసీనా వివరించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా చివరి రోజు అధికారిక నివాసంలో ఉండగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారని గుర్తు చేశారు . తాను ఆదేశిస్తే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపేవారని ఆమె పేర్కొన్నారు. అయితే కాల్పులు జరిగితే చాలా మంది మరణించేవారని, అందుకనే ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను 25 నుండి 30 నిమిషాల్లో ఢాకా నుండి బయలుదేరి భారత్కు వచ్చేశానని హసీనా వెల్లడించారు.
మరో విషయాన్నీ కూడా ఆమె ప్రస్తావించారు. రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ ప్రకటనను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రాణనష్టం కొనసాగితే తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని రెహమాన్ గతంలో పేర్కొన్నారు. “ఈరోజు నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి విద్యార్థి కో-ఆర్డినేటర్లతో కలిసి పక్కా ప్రణాళికతో సామూహిక హత్యలకు పాల్పడ్డాడు మహమ్మద్ యూనస్. వారే సూత్రధారులు” అని ఆమె స్పష్టం చేశారు