ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. తాజాగా గుజరాత్ లో పోలైన ఓట్లతో జాతీయపార్టీ అర్హత పొందింది ఆప్. ఆప్ ఆశయాలకు జాతీయ హోదా మరింత బూస్టప్ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. మరో కల నెరవేరిందని… గుజరాత్ ప్రజల ఓట్లతో నేడు ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తుంది. జాతీయ రాజకీయాల్లో విద్య, ఆరోగ్యం మొదటిసారిగా ప్రధాన అంశాలుగా నిలిచాయని సిసోడియా ట్వీట్ చేశారు.