‘హర్ ఘర్ దస్తక్’ డ్రైవ్లో భాగంగా కోవిడ్-19 వాక్సినేషన్ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా రాజస్థాన్ లో ఓ మహిళా వర్కర్ ఒంటె మీద మారుమూల గ్రామాలకు చేరుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తన ట్విట్టర్లోనూ షేర్ చేశారు. ఆ మహిళ తన వృత్తిలో చూపిన సంకల్పం, నిబద్ధతను గొప్పవని ప్రశంసించారు.
https://twitter.com/mansukhmandviya/status/1474236728797904902?s=20