చెన్నైలో మహిళా పోలీసు బాహుబలి అవతారమెత్తింది. నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. భారీవర్షాలకు టీపీచట్రం ఏరియాలోని శ్మశానవాటిక సమీపంలో ఓ వ్యక్తి స్పృహతప్పిపడిపోయాడు. అక్కడికి దగ్గర్లోనే సహాయక చర్యల్లో ఉన్న సీఐ రాజేశ్వరి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తాను తప్ప ఇతర పోలీసు సిబ్బంది అక్కడలేరు..దీంతో ఆలస్యం చేయకుండా వ్యక్తిని భుజంపైకి ఎత్తుకుని కొంతదూరం నడిచివెళ్లి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న ఓ వ్యక్తి తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్సై సాహసాన్ని, తెగువను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.