27ఏళ్ల తన కుమార్తెపై ఓ ముస్లిం కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు కాపాడమంటూ ఓ క్రైస్తవ మహిళ విశ్వహిందూ పరిషత్ ను ఆశ్రయించింది. వీహెచ్పీ చొరవతో మంగళూరులో ఉన్న నిందితుడైన ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చొక్కబెట్టు ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్ సిద్ధిక్ ఆ మహిళకు డ్రగ్స్ ఇస్తూ లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
సిద్దిఖ్ తన కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లి చాలారోజులు తన దగ్గరే పెట్టుకున్నాడని… స్నేహితులతో కలిసి పలుమార్లు అత్యాచారం చేశాడని, పోలీసులు, మతపెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వీహెచ్పీ ముఖ్యుల దగ్గర వాపోయింది. అంతేకాదు అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతను తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని కన్నీటి పర్యంతమైంది. వివరాలతో లేఖ రాసింది. దీంతో …యువతిని రక్షించి తల్లికి అప్పగించాలని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు వీహెచ్పీ ప్రతినిధులు.
బాధితురాలు తమను సాయం కోరుతూ ఇచ్చిన లేఖ వైరల్ కావడంతో…పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 354 మరియు 506 కింద కేసు నమోదు చేసి …సిద్ధిక్ను అరెస్టు చేశారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. నిందితుడికి మూడు పెళ్లిళ్లు నిజమేనని తేలింది. ఇప్పటికే డ్రగ్స్ కేసు నమోదైనట్టు తేలింది.
బాధితురాలికి మత్తుమందు ఇస్తూ అత్యాచారం చేస్తున్నమాట నిజమేనని పోలీసులు నిర్థారించారు.యువతి తల్లి గతంలో మంగళూరు సౌత్ ఈస్టు పోలీసు స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో వీహెచ్పీని ఆశ్రయించింది. వాళ్లు పట్టించుకుని ఆమెకు న్యాయం చేశారు. బాధితురాల్ని ఆదుర్మార్గుడి బారినుంచి విడిపించారు. ప్రస్తుతం బాధితురాలు కౌన్సెలింగ్ సెంటర్లో చికిత్స పొందుతోంది.