Adilabad : మోదీ మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చేతితో గీసి ఆనందం వ్యక్తం చేస్తూ బోథ్ పట్టణానికి చెందిన చిన్నారి నమలికొండ సుజయ్ కుమార్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి కంచికామకోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల లో వేద విద్యతో పాటు ఇంగ్లీషు విద్య ను అభ్యసిస్తున్న సుజయ్ ప్రస్తుతం ఆరవ తరగతి పూర్తి చేసుకుని ఏడవ తరగతి లోకి వెళ్తున్నాడు. అయోధ్య లో బాల రాముడికి ప్రతిష్టించడంతో పాటు భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తంగా చాటిచెప్పిన మోదీ అంటే తనకు అభిమానమనీ మరోమారు దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మోదీ నాయకత్వం అవసరమని తాను భావించాననీ సుజయ్ తెలిపాడు. తన అభిమానాన్ని ఈ విధంగా మోదీ చిత్రపటాన్ని చేతితో గీసి ఆయన పాలనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పననీ వివరించాడు.