హిందువులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కూడా అయిన బద్రుద్దీన్ హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం పురుషులు 21 ఏళ్లు నిండిన వెంటనే వివాహం చేసుకుంటారని, హిందూ పురుషులు ముగ్గురు, నలుగురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని 40 ఏళ్ల వరకు పెళ్లిచేసుకోరని అన్నారు. అజ్మల్ ఈ వ్యాఖ్యలు దేశంలోని హిందువుల్ని ముఖ్యంగా మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ అసోం విపక్ష నేత దేబబ్రత సైకియా సహా పలువురు ఫిర్యాదుచేశారు. అసోంజాతీయ పరిషత్ కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసింది.