అతను గతంలో ఎప్పుడో ఉద్దేశపూర్వకంగా లేదా, తెలియక లేదా పొరపాటున చేసిన ఒక పనిని లేదా మాటని బయటకు తెచ్చి కొద్దిగా ప్రచారం కల్పించండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు. ఆ తరువాతి పని హిందుత్వ వాదులు చూసుకుంటారు. ఆ వ్యక్తిపై హిందూ సమాజంలో ఉన్న నమ్మకం పూర్తిగా మట్టిగొట్టుకుపోయే దాకా వదలరు.
సద్గురు విషయంలో ఇప్పుడు సరిగా ఇదే జరుగుతోంది. ఆయన ఏమన్నారు, అది తప్పా ఒప్పా అనే చర్చ నేను చెయ్యదలుచుకోవడం లేదు. బహుశా తప్పేనేమో నాకు తెలియదు. సద్గురు పొరపాటు పడటం, తరువాత ఆ పొరపాటుని సరిదిద్దుకోవడం నేను కొన్ని సార్లు గమనించాను. శబరిమల విషయంలో ఆయన మొదట్లో స్త్రీల ప్రవేశాన్ని సర్దించారు, తరువాత వ్యతిరేకించారు. ఆ విషయం అందరికీ అర్థం అయ్యేలా చాలా గొప్ప ప్రయత్నం చేశారు. వేతకాలే కానీ వివేకానందుని బోధనలలో కూడా లోపాలు కనిపెట్టవచ్చు. గొప్ప జ్ఞానులు అయినంత మాత్రాన, అస్సలు ఏ చిన్న పొరపాటూ చెయ్యరు అని కాదు. కనుక మనం వీళ్ళ విషయంలో, మనం జరిగే పొరపాట్ల మీద కాకుండా మొత్తంగా వారి వలన జరుగుతున్న మంచిమీదే దృష్టి పెట్టాలి. మొన్న వివేకానందుని జయంతిరోజు కూడా స్వామి వారిని విమర్షిస్తూ ఎన్నో పోస్ట్లు చూశాను. సద్గురు లేదా శ్రీశ్రీ లేదా మోదీ లేదా వివేకానంద లేదా ధర్మరాజు లేదా భీష్ముడు లేదా చాణుక్యుడు లేదా నేతాజీ లేదా మరొక గొప్ప వ్యక్తి, ఇలా ఎవరి జీవితాలను తీసుకుని పరిశీలించినా విమర్శించగలిగిన, మనకు తప్పు అనిపించే అంశాలు దొరుకుతాయి. మూఢభక్తి ఉంటే తప్ప, అస్సలు లోపాలు కనబడకపోవడం సాధ్యం కాదు.
అలా అని విమర్శ తప్పు అనడం లేదు. కొంతకాలం క్రితం భీష్ముల వారి, ధర్మరాజు గారి కొన్ని నిర్ణయాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి వ్యాసాలు రాసినవాడిని నేను. అయితే ఆ విమర్శ మనకు ఉపయోగకరంగా ఉండాలే కానీ, మనకు చేటు చేసేదిగా కాదు. అలానే భాష విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. సద్గురు సహా, ఎవర్నైనా మనం విమర్శనాత్మక దృష్టితో పరిశీలించవచ్చు, అయితే సమయం సందర్భం కూడా చూసుకోవాలి. సద్గురు సుమారు 10 కోట్ల చెట్లు నటించారు. వందల కోట్ల చెట్లు నాటే ప్రణాళిక కావేరీ కాలింగ్ పేరుతో ఈ మధ్య ప్రారంభించారు. అందుకే ఆయన్ను అంతర్జాతీయంగా “ట్రీ మాన్ ఆఫ్ ఇండియా” అని పిలుతున్నారు. దాదాపు వంద దేశాలలో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఐక్య రాజ్య సమితి, యునెస్కో, యూనిసిఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్టాండ్ఫార్డ్, ఆక్స్ఫర్డ్, హార్వార్డ్, వివిధ ఐఐటీలు, ఐఐఎంలు సహా మరెన్నో అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఆయన్ని ఆహ్వానించాయి, ఆహ్వానిస్తున్నాయి. కొన్ని కోట్ల మందికి ఆయన ఇప్పటికి యోగా నేర్పారు, లక్షల మంది ఇషా సంస్థ తరఫున సమాజ సేవలో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేటి యువతరానికి అర్థం అయ్యే భాషలో (ఇంగ్లీష్ అని నా ఉద్దేశం కాదు), వాళ్ళు అంగీకరించేలా మన ధర్మానికి చెందిన ఎన్నో విషయాలను వివరించడంలో సద్గురుని మించిన వారు లేరు.
అటువంటి వ్యక్తి ఇప్పుడు #ఉద్యమన్ని ప్రారంభించారు. సద్గురు స్థాయి ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తి దేవాలయాలపై ప్రభుత్వ కబ్జా గురించి మాట్లాడటం బహుశా ఇదే తొలిసారి. అందువల్లనే ఎప్పుడూ లేనంతగా ఈ విషయంపై దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. బహుశా అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దేవాలయాల విడుదల దిశగా ఒకడుగు ముందుకు వేసి శ్రీశ్రీ రవిశంకర్, సద్గురు, నాగేశ్వరరావు గార్లను చర్చలకు ఆహ్వానించింది. ఇది శుభపరిణామం.
ఈ సమయంలో మనం ఇతర విషయాలు అన్నీ పక్కనబెట్టి, వీరికి, అలానే ఈ విషయంపై దశాబ్దాలుగా పోరాడుతున్న ఇతరులకు పూర్తి సహకారం, ప్రోత్సాహం అందించాలి. అలా కాకుండా, ఎప్పుటిదో పాత వీడియోలు పట్టుకుని, వాళ్లనేదో హిందూ ద్రోహులుగా చిత్రించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇన్ని రోజులూ లేనిది, ఇప్పుడే ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చిందో ఆలోచించారా? నాకు అర్థమైనంతవరకూ, కాశ్మీర్, రామజన్మ భూమి సమస్య కన్నా దేవాలయాల సమస్య మనకి మరింత ముఖ్యం. దేవాలయాలు హిందువుల చేతుల్లోకి వస్తే మనకున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక దయచేసి, విమర్శలను కొంత కాలం పక్కనబెడటం. ఇది అతర్గత కుమ్ములాటలకు సమయం కాదు.
#Sadguru
వడియాల రంజిత్