విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి ఇవాళ. కేవలం 18 సంవత్సరాల వయస్సులో భారత స్వాతంత్య్ర పోరాటం కోసం ఈ ధీరుడు తన జీవితాన్ని అర్పించాడు..
ఖుదీరామ్ బోస్ డిసెంబరు 3, 1889లో పశ్చిమ బెంగాల్లొని మిడ్నాపూర్ జిల్లా హబీబ్ పూర్లో జన్మించాడు.
చిన్ననాటి నుంచి తీవ్రమైన స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరాడు. తన నాయకత్వ లక్షణాలు, సాహసోపేతమైన స్ఫూర్తితో ఆ సంస్థలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి ఆయన టీచర్ సత్యేంవూదనాథ్ బోస్, భగవద్గీత స్ఫూర్తిగా నిలిచాయి. 1905లో బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చివేశాడు.
1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా ఎంతోమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్నికొద్దిదూరంలో నిలబడి చూస్తున్నసుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ళ యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లీష్ అధికారి ముక్కుమీద ఒక్కగుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్ ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి ఇతడు పెట్టింది పేరు. చిన్నవాడన్నదయలేకుండా సుశీల్ కుమార్ కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడా దెబ్బకు వందేమాతరం అని నినాదించాడు.
ఈ సంఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్ ఫోర్డ్ కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. మానవరూపంలో ఉన్న మృగమైన ఫోర్డ్ లాంటి వారు ఉన్నంత వరకు దేశభక్తవీరులకు కష్టాలేనని భావించి అతనిని చంపడానికి నిశ్చయించుకున్నారు.
1908 ఏప్రిల్ మొదటివారంలో జుగాంతర్ అనే విప్లవ సంస్థకి చెందిన విప్లవవీరులు కొందరు కలకత్తలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ ఫోర్ట్ ను అంతం చెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాంబోసునూ ప్రఫుల్లచాకి అనే మరో నవయువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్ పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒక బాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్ ఫోర్డ్ క్లబ్ బయటకురాగానే దానిపైకి బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తివెళ్లిపోయారు.
అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేదు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా ఖుదీరాంబోస్ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణచేశారు.
బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్కు ఖుదీరాంబోస్ పూసా అని ఈ మధ్యే పేరు పెట్టారు
” నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం , నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ భరతమాతే… ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం నా అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే… మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలని ” అంటూ విప్లవ వీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ …. ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు నేను మర్చిపోలేను
భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్,
వందేమాతర నినాదాన్నే ఊపిరిగా, తెల్ల దొరలను తరిమి కొట్టడమే ధ్యేయంగా , పాఠ్యపుస్తకాలను వదిలి పోరుబాట పట్టి స్వాతంత్ర్య కాంక్షతో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్ ,
పాలుగారే పసితనంలో పలక పుస్తకం పట్టి ఆటపాటలతో గడపాల్సిన సమయంలో ఆంగ్లేయుల చేతిలో హింసలకు బలౌతున్న భారతీయలను ఎలా కాపాడగలనని ఆలోచిస్తూ ప్రాణాలు ఇచ్చైనా పోరాటం చేయాలని విప్లవమార్గం పట్టిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్.
వందేమాతర గీతం యొక్క సారాన్ని నిరక్షరాస్యులైన ప్రజలకు అర్ధమయ్యేలా, విద్యావంతులకు స్పూర్తినిచ్చేలా కరపత్రాలను తయారు చేసి స్వయంగా పంచుతూ అడ్డగించిన బ్రిటీష్ సైనికులపై ప్రతిదాడి చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన భారత బెబ్బులి ఖుదీరామ్ బోస్.
.
అత్యంత క్రూరుడైన కింగ్ ఫోర్ట్ పై మొట్ట మొదటి బాంబుదాడి చేసి బ్రిటీష్ దొరలకు ప్రాణభయాన్ని రుచి చూపించిన మొట్టమొదటి భారతీయుడు ఖుదీరామ్ బోస్.
బ్రిటీష్ వారిచ్చే బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే తనని పట్టిస్తే, ఉరిశిక్ష విధించిన జడ్జీ నీ చివరికోరిక ఏంటని ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం ” మీరు గనుక అనుమతిస్తే ఇక్కడున్న నా భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ చెప్పాలనుకుంటున్నాను ” అని. కోర్టు దానికి అనుమతించకపోవడంతో తన స్పూర్తిని ప్రజల్లో నింపుతూ వందేమాతర నినాదం చేస్తూ, భరతమాతకు జై కొడుతూ భగవద్గీత చేత్తో పట్టుకుని ఉరికంబానికి వేలాడి తన దేశభక్తిని చాటుకున్న గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్ బోస్….!!!
ఇలాంటి దేశభక్తుల చరిత్రలు తెలియని మీ మిత్రులకూ, పిల్లలకూ ఇలాంటి వారిని గురించి తెలియచేసి మీ దేశభక్తిని చాటుకుంటారని ఆశిస్తూ…. ఈరోజు ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాధ్యనీయుడైన సుప్రసిద్ద స్వతంత్ర్య సమరయోధుడు ఖుదీరాంబోస్.