మసీదులో బాంబు తయారీ ట్రైనింగ్ ఇస్తుండగా పేలుడు.. 30 మంది మృతి
ముస్లింల ప్రార్ధనా స్థలమైన మసీదును తాలిబన్ ఉగ్రవాదులు ఉగ్ర శిక్షణకు అడ్డాగా మార్చుకున్నారు. ఐఈడీ బాంబులను ఎలా సెట్ చేయాలి..? వాటిని ఎలా పేల్చాలి..? అన్న అంశాలపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు. ఈ క్లాసులను ఇతర దేశాలకు చెందిన వారికి కూడా ఇస్తున్నారు. అయితే ఇలా బాంబుల తయారీకి శిక్షణ ఇస్తుండగా.. అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న 30 మందికి పైగా మృతిచెందారు. వీరిని తాలిబన్ ఉగ్రవాదులుగా గుర్తించారు. అయితే వీరిలో ఆరుగురు విదేశీయులు కూడా ఉన్నారని.. వారిని ఇంకా గుర్తించలేదని ఆఫ్ఘన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సంఘటన బల్ఖ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.